Saturday, May 15, 2010

Naa desham....


ముసలిదైపొయింది...నా భరత ధాత్రి...

మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని...

ముసురుకున్న బాధల వానకారులొ

మసలుకొనే దెలా చివరికంటూ...

మసి బారిన చూపుతొ... ససి చెడిన రూపుతొ...

సాగర భ్రాత కెరటాల గుండె హొరులలొ

మోయలేని తన వయస్సుని తలచుకొని...

వేల యేళ్ళ బరువును దించమని...

తన సొదరుడైన సముద్ర సన్నిధిన

కన్నీరు పెట్టుకొని ఏడుస్తుంది...నా పిచ్చి ధాత్రి...

పచ్చని తన పడుచుదనం మీద వెచ్చగా పడిన

ప్రధమ సూర్యొదయాశ్లేషానికి పులకరిస్తూ...

నీలాల మోహన వస్త్రం దొలిచి...

మౌళి మీద హిమసుందర కిరీటం ధరించిన

ఆనాటి మహరాణి నా భరతదాత్రి...

నేడు ఈ పాడు నాగరికతలొ పాలిపొతూ...కాలుష్యానికి కరిగిపొతూ...

పాపత్ములకు పురుడు పొస్తూ...రుధిరంలొ తడిసిపొయింది...

ముడుచుకుని పొయిన తన వొడలి ముడతలను చూస్తూ...

భావ శూన్యురాలై మూగబొయింది...

No comments:

Post a Comment